: మరో ప్రకటనతో కేజ్రీవాల్ పై బీజేపీ దాడి

ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పై ప్రకటనల రూపంలో బీజేపీ దాడి కొనసాగుతూనే ఉంది. తొలుత ఓ ప్రకటనలో అన్నాహజారే, కాంగ్రెస్ తో లింక్ చేసి కేజ్రీని విమర్శించింది. తాజాగా మరో ప్రకటనలో ఆప్ నేత లక్ష్యంగా వ్యంగ్యాస్త్రం సంధించింది. ఈ మేరకు ఢిల్లీ ప్రధాన వార్తా పత్రికల్లో కార్టూన్ రూపంలో రూపొందించిన ఓ ప్రకటనను ఇచ్చింది. తొలిసారి సీఎం పదవి చేపట్టిన అనంతరం కేజ్రీ ఓ ఏడాది గణతంత్ర వేడుకలకు అంతరాయం కలిగిస్తానని బెదిరించడం, ఆ మరుసటి ఏడాది రిపబ్లిక్ డే పరేడ్ కు విఐపీ పాస్ అడగడాన్ని అందులో పేర్కొంది. అంతేగాక, కేజ్రీవాల్ 'ఉపద్రవి (రచ్చ) గోత్రానికి చెందినవాడని కుల సంబంధ వ్యాఖ్యలు చేసింది. దాంతో కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News