: ఒంగోలులో కలకలం... స్వైన్ ఫ్లూ తో మహిళ మృతి
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో స్వైన్ ఫ్లూ మహమ్మారి కలకలం రేపుతోంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోకిల (75) అనే మహిళ ఈ ఉదయం చనిపోయింది. ఈమె మృతితో ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూతో మరణించిన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. దీంతో, జిల్లాలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం స్వైన్ ఫ్లూ నివారణకు అవసరమైన చర్యలను చేపట్టినట్టు తెలిపింది.