: బెంగళూరు నుంచి చెన్నైకి రూ.699, కొచ్చిన్ కు రూ.899... ఎయిర్ఏషియా బంపర్ ఆఫర్
ప్రయాణికులకు చౌక ధరల్లో టికెట్లను అందిస్తున్న విమానయాన సంస్థ ఎయిర్ఏషియా సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా, బెంగళూరు నుంచి... చెన్నైకి రూ.699, కోచికి రూ.899, గోవాకు రూ.1,099, పూణేకు రూ.1,499, జైపూర్, చండీగఢ్ లకు రూ.1,999లకే టికెట్లను అందించనున్నట్టు సంస్థ తెలిపింది. ఈ ఆఫర్లతో బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, నేటితో ముగుస్తాయని కంపెనీ తన వెబ్సైట్ లో వెల్లడించింది. ఈ టికెట్లను ఆగస్టు 3 నుంచి వచ్చే ఏడాది మార్చి 26 వరకూ జరిగే ప్రయాణాల కోసం బుక్ చేసుకోవచ్చని పేర్కొంది.