: అధికారిక లాంఛనాలతో ముగిసిన ఆర్కే లక్ష్మణ్ అంత్యక్రియలు

ప్రఖ్యాత కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ అంత్యక్రియలు ఈ మధ్యాహ్నం పూణెలోని వైకుంఠ శ్మశానవాటిక గ్రౌండ్ లో జరిగాయి. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. 'మహా' ప్రభుత్వం తరపున ఆయన గౌరవార్థం పోలీసులు గాల్లోకి 21 సార్లు కాల్చారు. ఆయన కుమారుడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పలువురు రాజకీయ నేతలు, సంపాదకులు, మీడియా ప్రతినిధులు, వేలమంది అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరోవైపు లక్ష్మణ్ కు ప్రభుత్వం తరపున విగ్రహం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News