: వచ్చినప్పుడే వస్తాయి అవార్డులు: షూటర్ గగన్ నారంగ్

'పద్మ' అవార్డుల విషయంలో ఇటీవల సైనా నెహ్వాల్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తాజాగా, 'పద్మ' పురస్కారాలకు ఎంపికైన వారి జాబితా కేంద్రం ప్రకటించకపోయినా, మీడియాలో మాత్రం వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, భారత స్టార్ షూటర్ గగన్ నారంగ్ స్పందించాడు. అవార్డుల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తానని తెలిపాడు. పనిచేసుకుంటూ పోవడమే తనకిష్టమని చెప్పుకొచ్చాడు. అవార్డుల కోసం తొందరపడనని, వచ్చినప్పుడే వస్తాయని అన్నాడు. 'పద్మ' అవార్డుల విషయంలో వివాదాల్లోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని తెలిపాడు.

More Telugu News