: ఢిల్లీలో కూలిన ఏడంతస్తుల భవనం... శిథిలాల కింద పలువురు?

దేశ రాజధాని ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది. నగరంలోని గౌతంపురి ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నేటి తెల్లవారుజామున భవనం ఉన్నట్లుండి కూలిపోయింది. ఈ ప్రమాదంలో భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి తరలివెళ్లారు. శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను బయటకు తీసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం 10 ఫైరింజన్ల సహాయంతో ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

More Telugu News