: మడకశిర బస్సు ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు

అనంతపురం జిల్లా మడకశిర బస్సు ప్రమాదంపై ఏపీ సర్కారు విచారణకు ఆదేశించింది. దాదాపు 60 మంది ప్రయాణికులతో మడకశిర నుంచి పెనుగొండ బయలుదేరిన ఆర్టీసీ బస్సు లోయలో పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికే 14 మంది చనిపోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. ప్రమాదంపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News