: ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

ఏపీ శాసనసభ శుక్రవారానికి వాయిదాపడింది. శీతాకాల సమావేశాలు ఈ ఉదయం ఆరంభం కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. దానిపై నేతలు మాట్లాడారు. దాని తర్వాత, పెషావర్ లో మరణించిన వారికి సభ సంతాపం తెలిపింది. సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం, స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

More Telugu News