: జవహర్ నగర్ పేలుడులో చిన్నారి బాలిక మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో కొద్దిసేపటి క్రితం జరిగిన పేలుడులో గాయడపడ్డ చిన్నారి బాలిక కీర్తివాణి మరణించింది. ఈ ఘటనలో గాయపడ్డ నర్సమ్మ, వాగిల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. జవహర్ నగర్ లోని ఓ ఇంటిలో సంభవించిన పేలుడుతో అక్కడికి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారి బాలికలు ముగ్గురూ తీవ్రగాయాలపాలయ్యారు. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా, చికిత్స అందిస్తుండగానే కీర్తివాణి మరణించింది. ఇదిలా ఉంటే, పేలుడుకు దారి తీసిన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.

More Telugu News