: టీడీపీ ఎమ్మెల్యేలను సభనుంచి లాక్కెళ్లిన మార్షల్స్
తెలంగాణ శాసనసభ నుంచి 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. వీరందరినీ సభ నుంచి మార్షల్స్ బయటకు బలవంతంగా తీసుకెళ్లారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, సస్పెండైన టీడీపీ నేతలంతా అసెంబ్లీ మెట్ల మీద బైఠాయించారు. టీఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.