: ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ముందుగా భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సభ్యులను ఆయన కలుస్తారు. మధ్యాహ్నం 1.15 నుంచి 2.30 వరకు భారత ఆర్థిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. అనంతరం బాబు ఏపీ భవన్ కు వెళతారు. ఇక, సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను కలుస్తారు. ఆ తర్వాత 5.30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమవుతున్నారు.

More Telugu News