: వాఘా సరిహద్దు వద్ద భారీ పేలుడు

పాకిస్థాన్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది. లాహోర్ శివారుల్లోని వాఘా సరిహద్దు వద్ద ఈ భారీ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు ధాటికి 45 మంది మృత్యువాత పడగా, 70 మంది క్షతగాత్రులుగా మారారు. ఈ పేలుడు తీవ్రతకు భవనాలు బీటలు వారగా, పలు భవనాల కిటికీలు బద్దలయ్యాయి. పలు భవనాలు, దుకాణ సముదాయాలు ధ్వంసమయ్యాయి. పాక్ పోలీసులు దీనిని ఆత్మాహుతి దాడిగా భావిస్తుండగా, దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. క్షతగాత్రులను లాహోర్ లోని ఆసుపత్రికి తరలించారు.

More Telugu News