: మోహన్ బాబుకు 'బెజవాడ గోపాలరెడ్డి' పురస్కారం

నటుడు మోహన్ బాబు కీర్తికిరీటంలో మరో విశిష్ట అవార్డు చేరింది. మంగళవారం నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన బెజవాడ గోపాలరెడ్డి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, ఈ అవార్డు రావడం సంతోషదాయకమన్నారు. రాజకీయాలు 90 శాతం కలుషితమయ్యాయని అభిప్రాయపడ్డారు. మిగతా 10 శాతం మంచి రాజకీయనేతలున్నారని, అలాంటి వారిలో బెజవాడ గోపాలరెడ్డి ఒకరని పేర్కొన్నారు. అలాంటి నేత పేరిట తనకు అవార్డునివ్వడం గొప్పగా భావిస్తున్నానని తెలిపారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. బెజవాడ గోపాలరెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి. ఈయన స్వాతంత్ర్యోద్యమంలోనూ పాల్గొన్నారు. పదకొండు భాషల్లో ఈయనకు ప్రవేశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు నిర్వహించిన గోపాలరెడ్డి ఉత్తరప్రదేశ్ గవర్నర్ గానూ వ్యవహరించారు.

More Telugu News