: తుపాను బాధితులకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం

హుదూద్ తుపాన్ బాధితులకు ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో సీఎం చంద్రబాబుకు అందజేస్తానని తెలిపారు. ఇలాంటి సమయాల్లో రాజకీయాలకు అతీతంగా బాధితులను ఆదుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో త్వరలోనే పర్యటిస్తానని చెప్పారు. ఇదే సమయంలో తుపాను సహాయక చర్యల్లో పాల్గొనాలని అభిమానులకు పిలుపునిచ్చారు.

More Telugu News