: ఏపీకి ఆపన్నహస్తం అందిస్తామంటున్న కేసీఆర్

ఉత్తరాంధ్రను హుదూద్ తుపాను కుదిపేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పందించారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని కేసీఆర్ హైదరాబాదు తిరుగుప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలో తుపాను బీభత్సంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి అన్ని రకాలుగా సాయపడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తాము సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని ఏపీ సర్కారుకు తెలియజేయాలని ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు.

More Telugu News