: మలాలా పాకిస్థాన్ కు గర్వకారణం: నవాజ్ షరీఫ్

నోబెల్ శాంతి పురస్కారం పొందిన పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ ను ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అభినందించారు. ఆమె పాకిస్థాన్ కే గర్వకారణమని ఈ సందర్భంగా ప్రశంసించారు. "మలాలా పాకిస్థాన్ కే గర్వకారణం. దేశ పౌరులను గర్వపడేలా చేసింది. తను సాధించింది అసమానమైనది, అనన్య సమానమైంది. ప్రపంచంలోని బాలికలు, బాలురు మలాలా పోరాటాన్ని, నిబద్ధతను స్పూర్తిగా తీసుకోవాలి" అని ఏఎఫ్ పీకి పంపిన ప్రకటనలో పేర్కొన్నారు.

More Telugu News