: పూటుగా తాగి భార్య గొంతు కోశాడు

విశాఖపట్టణం జిల్లా ఎండాడ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మత్స్యకారులు అధికంగా నివసించే ఎండాడలో పూటుగా తాగేసిన ఓ వ్యక్తి, మద్యం మత్తులో తన భార్య గొంతు కోశాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో స్థానికులు విషయం గమనించి అతనికి దేహశుద్ధి చేశారు. కత్తిగాట్లతో గాయపడిన ఆమెను హుటా హుటీన ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతనికి బడితె పూజ చేసి పోలీసులకు అప్పగించారు.

More Telugu News