: ఈ ఉదయం చెన్నైలో మాండలిన్ శ్రీనివాస్ మృతి

ప్రముఖ మాండలిన్ విద్వాంసుడు యు.శ్రీనివాస్ ఈ ఉదయం మరణించారు. ఆయన వయసు 45 ఏళ్లు. అనారోగ్యంతో ఈ ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుప్రతిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 1969 ఫిబ్రవరి 28న శ్రీనివాస్ జన్మించారు. 1998 లో కళారంగంలో ఆయన చేసిన సేవలకు గాను ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

More Telugu News