: సచివాలయాల పరిసరాల్లో రెండు నెలల పాటు పోలీస్ ఆంక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ పరిసరాల్లో ఆంక్షలు విధిస్తున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 19వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 18 ఉదయం 6 గంటల వరకు అంటే సుమారు రెండు నెలలపాటు ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో ఆ ప్రాంతానికి 500 మీటర్ల దూరం వరకు బహిరంగ సభలు, సమావేశాలు, ధర్నాలు, ప్లకార్డులతో ప్రదర్శనలు చేయరాదని, ఆయుధాలతో తిరగరాదని ఆయన సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.

More Telugu News