: రాణించిన ధోనీ, బ్రావో... కోల్ కతా విజయ లక్ష్యం 158

కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, బ్రావో రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఛాంపియన్స్ లీగ్ ట్వెంటీ20 ట్రోఫిలో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన ధోనీ సేన జాగ్రత్తగా ఆడింది. 13 బంతుల్లో స్మిత్ 20 పరుగులు చేయగా, మెక్కల్లమ్ (22), రైనా (28) పరుగులు చేసి రాణించారు. చివర్లో కేవలం 20 బంతుల్లో ధోని 2 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 35 పరుగులు చేయగా, అతనికి అండగా బ్రావో (28) నిలిచాడు దీంతో చైన్నై సూపర్ కింగ్స్ 158 పరుగుల లక్ష్యాన్ని కోల్ కతా ముందు ఉంచింది. కోల్ కతా బౌలర్లలో చావ్లా (2), నరైన్, పఠాన్ చెరో వికెట్ పడగొట్టారు.

More Telugu News