: సీబీఐ డైరెక్టర్ కు సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టాలని సుప్రీం ఆదేశం
2జీ కేసులో సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హాకు సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టాలని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎవరో ఏదో ప్రకటన చేశారని, దాని ఆధారంగా దర్యాప్తునకు ఆదేశించలేమని పేర్కొంది. కాబట్టి, భూషణ్ తప్పకుండా సీబీఐ డైరెక్టర్ ఇంటి అతిథుల జాబితాను వెల్లడించాలని తెలిపింది. వారి పేర్లను సీల్డ్ కవర్లో తమకు అందించాలని చెప్పింది.
అయితే, ప్రశాంత్ భూషణ్ ఆరోపిస్తున్నట్లు రిజిస్టర్ లోని 90 శాతం పేర్లు అసత్యమని, కొన్నే నిజం కావొచ్చని సిన్హా వాదించారు. ఈ మేరకు సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిన ఆయన, తనపై భూషణ్ దాఖలు చేసిన అఫిడవిట్ ను తిరస్కరిస్తున్నానన్నారు. తనపై తప్పుడు సాక్ష్యాలు ఇస్తున్నారని, అదే విధంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 22కి వాయిదా వేసింది.