: శారదా చిట్ ఫండ్ స్కాంలో తృణమూల్ ఎంపీకి సమన్లు

శారదా చిట్ ఫండ్ స్కాంలో సీబీఐ దర్యాప్తు వేగవంతంగా జరుగుతోంది. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర అధికార పార్టీ తృణమూల్ రాజ్యసభ సభ్యుడు శ్రింజాయ్ బోస్ కు సీబీఐ సమన్లు పంపింది. ఈ క్రమంలో కొన్ని రోజుల్లో ఆయన విచారణకు హాజరవుతారు. కోట్ల రూపాయల ఈ కుంభకోణంలో ఇప్పటికే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా పలువురు తృణమూల్ నేతలు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, పశ్చిమబెంగాల్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రజత్ మజుందర్ ను ఇదే స్కాంలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

More Telugu News