: ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నరే నిర్ణయిస్తారు: రాజ్ నాథ్ సింగ్

ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి సూటిగా సమాధానం ఇచ్చేందుకు తప్పించుకున్న కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్... ఆ అంశాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ పై నెట్టారు. ఆ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ (నజీబ్ జంగ్) మాత్రమే నిర్ణయం తీసుకోగలరని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే, ఈ అంశంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి హోంశాఖ ఏ సిఫారసు చేసిందన్న దానిపై మంత్రి స్పందిస్తూ, అసలు, రాష్ట్రపతి తమ సలహా ఏమీ కోరలేదని తెలిపారు. ఇక, తమ ఎమ్మెల్యేలకు డబ్బు ఆశచూపి, వారిని కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతల వ్యాఖ్యలపై మాట్లాడేందుకు రాజ్ నాథ్ తిరస్కరించారు.

More Telugu News