: ఆ ఇద్దరినీ చంపినవారికి కళ్ళు చెదిరే నగదు బహుమతి!

ఐఎస్ఐఎస్ చీఫ్ అబు బకర్ అల్-బాగ్దాదీ, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ లను చంపిన వారికి రూ.5 కోట్లు బహుమతిగా ఇస్తామని లక్నోలోని ఆలిండియా షియా హుస్సేని ఫండ్ (ఏఐఎస్ హెచ్ఎఫ్) ప్రకటించింది. ఈ మేరకు సదరు షియా ఆర్గనైజేషన్ ఓ హిట్ లిస్టును విడుదల చేసింది. ఈ జాబితాలో బాగ్దాదీ, హఫీజ్ లే కాకుండా, తాలిబాన్ చీఫ్ ముల్లా ఒమర్, అల్ ఖైదా చీఫ్ అయిమాన్ అల్ జవహరి, హర్కతుల్ ముజాహిదీన్ అధినేత అజర్ మసూద్ కూడా ఉన్నారు. కాగా, ఈ ఉగ్రనేతలను హతమార్చిన వారికి నగదు బహుమతి అంటూ పోస్టర్లను కూడా విడుదల చేశారు. దీనిపై, ఏఐఎస్ హెచ్ఎఫ్ చీఫ్ హసన్ మెహంది మాట్లాడుతూ, ఇస్లాం పేరిట విధ్వంసాలకు పాల్పడుతున్న ఇలాంటి టెర్రరిస్టు సంస్థలకు వ్యతిరేకంగా ముస్లింలు పోరాడాలని పేర్కొన్నారు.

More Telugu News