: ఏపీ, తెలంగాణల మధ్య ఉద్యోగుల పంపకాలు త్వరలో పూర్తిచేస్తాం: మంత్రి జితేంద్రసింగ్

రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన అంశాన్ని కాంగ్రెస్ నేత జేడీ శీలం లేవనెత్తారు. ఉద్యోగుల విభజన ఎప్పటిలోగా పూర్తిచేస్తారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. విభజన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని... ప్రస్తుతానికి తాత్కాలికంగా కేటాయింపులు చేశామని... త్వరలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగుల కేటాయింపులు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉద్యోగుల విభజనపై సిన్హా కమిటీ నివేదిక తమకు అందిందన్నారు.

More Telugu News