: రాష్ట్రపతికి గవర్నర్, చంద్రబాబు, కేసీఆర్ స్వాగతం
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాదు, బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్ ముందుగా ఘన స్వాగతం పలికారు. తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు కూడా ప్రణబ్ కు స్వాగతం పలికారు. హైదరాబాదు శివారు శామీర్ పేటలో ఉన్న నల్సార్ విశ్వవిద్యాలయంలో జరగనున్న 12వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు.