: 'కామన్వెల్త్' విజేతలకు రాష్ట్రపతి అభినందనలు

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు క్రీడాకారులకు లేఖలు రాశారు. పతకం సాధించిన ప్రతి అథ్లెట్ కు ఆయన వేర్వేరుగా ఉత్తరాలు రాయడం విశేషం. భవిష్యత్తులోనూ ఇలాగే విజయాలు సాధించాలని ప్రణబ్ ఆకాంక్షించారు. "మీ విశేష ప్రదర్శన అంతర్జాతీయ యవనికపై భారత సత్తాకు పరాకాష్ఠ" అని పేర్కొన్నారు.

More Telugu News