: దాశరధి రంగాచార్యులను పరామర్శించిన హరీశ్ రావు

ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్యులను తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాశరధి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని, ఆయన వైద్యానికి అయ్యే ఖర్చును తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని హరీశ్ రావు చెప్పారు. రంగాచార్యులు దివంగత దాశరథి కృష్ణమాచార్యులకు తమ్ముడు.

More Telugu News