: ఎవరొచ్చినా పోలవరాన్ని అడ్డుకోలేరు: జైరాం రమేశ్

పోలవరం నిర్మాణంపై కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ధీమాతో ఉన్నారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా పోలవరాన్ని అడ్డుకోలేరన్నారు. అనంతపురంలో ఈ మేరకు మీడియాతో జైరాం మాట్లాడుతూ, జైలు నుంచి బెయిల్ పై వచ్చిన జగన్ ను ప్రజలు సీఎం చేయరన్నారు. వైసీపీ ఓ నకిలీ కాంగ్రెస్ అని ప్రజలు దానిని విశ్వసించరని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వల్లే కాంగ్రెస్ తో పాటు సీమాంధ్ర భారీగా నష్టపోయిందని ఆరోపించారు. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్లే కాంగ్రెస్ ను వదిలి వెళ్లారని ఆయన విమర్శించారు.

More Telugu News