: శోభానాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఫోన్ లో ఆరా తీసిన జగన్

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ నాయకురాలు శోభానాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి డాక్టర్ సోమరాజుతో పాటు, ఇతర ప్రముఖ వైద్యులతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రమాదం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శోభ కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ రాజమండ్రి నుంచి విమానంలో హైదరాబాద్ బయల్దేరగా, జగన్ సతీమణి భారతి కడప నుంచి హైదరాబాద్ బయల్దేరారు.

More Telugu News