: విజయవాడలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పేలి ముగ్గురికి గాయాలు

విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఆవరణలోని విద్యుత్ సబ్ స్టేషన్ ట్రాన్స్ ఫార్మర్ పేలడంతో ముగ్గురు క్షతగాత్రులయ్యారు. సబ్ స్టేషన్ లోని ట్రాన్స్ ఫార్మర్ లోకి విద్యుత్తును సరఫరా చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విద్యుత్ శాఖ ఏఈలు బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డితో పాటు ఎల్.ఐ సత్యనారాయణ గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్ శాఖాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

More Telugu News