: భద్రాచలంలో ఘనంగా ప్రారంభమైన శ్రీరామనవమి వేడుకలు

ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవాలయం నుంచి కల్యాణ మండపం వరకు అత్యంత వైభవంగా ఉరేగింపు సాగుతోంది. గోదావరిలో పుణ్యస్నానాల కోసం భక్తులు బారులు తీరారు. కల్యాణమూర్తుల ఊరేగింపు ఈ రోజు ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ఉంటుంది. అనంతరం సీతారాముల కల్యాణం ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగుతుంది. స్వామివారి కల్యాణానికి తలంబ్రాలు, పట్టువస్త్రాలను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సమర్పిస్తారు.

More Telugu News