: బీజేపీ మేనిఫెస్టో వివరాలు...

రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి బీజేపీ 40 పేజీల మేనిఫెస్టోను విడుదల చేసింది. మేనిఫెస్టో వివరాలను పార్టీ అగ్రనేత మురళీ మనోహర్ జోషి వెల్లడించారు. మేనిఫెస్టోలోని వివరాలు...

* ఎన్నికల్లో బీజేపీ నినాదాలు: 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్', 'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్'.
* అవినీతి నిర్మూలన, నల్లధనాన్ని అరికట్టడానికి పెద్దపీట.
* వ్యవస్థలో మార్పులు, పాలనలో పారదర్శకత.
* ఉపాధి కల్పనకు ప్రాధాన్యత.
* చట్ట పరిధిలో రామాలయ పునర్నిర్మాణం.
* మహిళల భద్రతకు ప్రత్యేక పోలీసు విభాగం.
* అందరికీ ఆహార భద్రత కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక.
* మరిన్ని ఎన్నికల సంస్కరణలను తీసుకువస్తాం.
* ఈ గవర్నెన్స్ కు పెద్దపీట.
* వెనుకబడ్డ రాష్ట్రాలను ప్రత్యేక ప్యాకేజీల ద్వారా అభివృద్ధి చేస్తాం.
* దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు.
* మల్టీ బ్రాండ్ రీటెయిల్ వ్యాపారంలో ఎఫ్ డీఐలను అనుమతించం. ఉద్యోగాల కల్పన కోసం ఇతర రంగాల్లో పెట్టుబడులను అనుమతిస్తాం.
* సరళతరమైన పన్నుల విధానాన్ని తీసుకొస్తాం.
* వ్యవసాయ భూములకు సాగునీటి కల్పన, ప్రతి గ్రామానికి సురక్షిత మంచినీరు.
* గ్రామీణ ప్రాంతాలకు వైఫై (ఇంటర్నెట్) సదుపాయం.
* పోలీసు, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తాం. కేసుల సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్ విభాగాన్ని అభివృద్ధి చేస్తాం.
* పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గిస్తాం.
* బ్రాండ్ ఇండియాను నిర్మిస్తాం.
* తీవ్రవాద నిరోధానికి ప్రత్యేక యంత్రాంగం.
* అభివృద్ధి సాధన కోసం కేంద్ర, రాష్రాల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలను నెలకొల్పుతాం.
* దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరచడం కోసం... అన్ని చర్యలు తీసుకుంటాం.
* ప్రజారోగ్యం కోసం కొత్త పాలసీ. ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ స్థాయి ఆసుపత్రి.
* టూరిజం అభివృద్ధి కోసం కొత్తగా 50 టూరిస్ట్ సర్య్కూట్స్ ఏర్పాటు.
* దేశవ్యాప్తంగా గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు.
* అన్ని వర్గాలకు సమానంగా ముస్లింలకు కూడా అవకాశాలు. మదర్సాల అభివృద్ధి కోసం కొత్త పథకం తీసుకొస్తాం.
* సొంత రాష్ట్రానికి (కాశ్మీర్) కాశ్మీరీ పండిట్లు తిరిగి వెళ్లి... గౌరవంగా బతికేలా చర్యలు తీసుకుంటాం.
* పాకిస్థాన్(పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్) లో ఉన్న శరణార్థుల డిమాండ్లను అంతర్జాతీయ వేదికలపై చర్చిస్తాం.
* పారిశుద్ధ్య కార్మిక (స్కావెంజర్స్) వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తాం.
* వికలాంగుల సంరక్షణకు ప్రత్యేక పథకాలు.
* విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.
* హిమాలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధి.
* సామానత్వాన్ని సాధించేందుకు ఉమ్మడి పౌర స్మృతి.
* దేశ అభివృద్ధి కోసం నూతన వైజ్ఞానిక ఆవిష్కరణ.

More Telugu News