: బాబు సభను ఎందుకు అడ్డుకోలేదు? : టీఆర్ఎస్ ను ప్రశ్నించిన పొన్నం
తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్ర నేతల సభలను బహిష్కరించాలని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రజలను కోరారు. సీమాంధ్ర నేతలు ఇప్పటికీ తెలంగాణలో తమ పెత్తనం కొనసాగించాలనుకుంటున్నారని ఆరోపించారు. దీన్ని అరికట్టాలంటే సీమాంధ్రుల సభలను బహిష్కరించడం ఒక్కటే మార్గమని చెప్పారు. మొన్న మహబూబ్ నగర్ లో చంద్రబాబు నాయుడు నిర్వహించిన టీడీపీ సభను ఎందుకు అడ్డుకోలేకపోయారని టీఆర్ఎస్, టీజేఏసీ నేతలను పొన్నం ప్రశ్నించారు.