: భద్రాచలంను కలపకపోవడం సీమాంధ్రకు అన్యాయమే: గోరంట్ల

భద్రాచలంను తెలంగాణలో ఉంచడం సీమాంధ్రకు అన్యాయం చేసినట్లేనని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, భద్రాచలంను తెలంగాణలోనే ఉంచడం వల్ల పోలవరం ప్రాజెక్టుకు ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. ఇప్పటికే విద్యావ్యవస్థ, ఉన్నతస్థాయి విద్యాలయాలు తెలంగాణకే పరిమితమైపోయాయని అన్నారు. రాష్ట్రాన్ని విభజించిన యూపీఏ సీమాంధ్రులను కట్టుబట్టలతో బయటికి గెంటేసిందని అన్నారు.

More Telugu News