: వెయ్యిమంది సోనియాలు వచ్చినా నన్నేమీ చేయలేరు: బాబు

తన నిజాయతీయే తనకు శ్రీరామరక్ష అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. వెయ్యిమంది సోనియాలు వచ్చినా తననేమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. అందుకు తన నీతి నిజాయతీలే కారణమని చెప్పారు. విజయనగరం సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఎవరైనా కాంగ్రెస్ పేరెత్తితే సంఘ బహిష్కరణ విధించే రోజులు వస్తాయన్నారు. 'మనం ఎన్టీఆర్ కు వారసులం' అని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు ఒక కొండవీటి సింహంలా తయారవ్వాలని బాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్ఫూర్తిగా ముందుకుసాగాలని సూచించారు.

More Telugu News