: పార్లమెంటుకు భారీ భద్రత

రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు చర్చకు రానున్న సందర్భంగా మరోసారి పార్లమెంటుకు భారీ భద్రత కల్పించారు. భారీ సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాజ్యసభ ఛైర్మన్ భద్రతా సిబ్బందిని ఆదేశించారు. కాగా రాజ్యసభలో మరోసారి ఘర్షణ వాతావరణం నివారించేందుకు మార్షల్స్ ను కూడా పెద్ద ఎత్తున సిద్ధం చేశారు.

More Telugu News