: రేపటికి వాయిదా పడ్డ లోక్ సభ

అత్యంత గందరగోళ పరిస్థితుల్లో లోక్ సభ రేపటికి వాయిదా పడింది. వాయిదాల అనంతరం 12 గంటలకు ప్రారంభమైన లోక్ సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సీమాంధ్ర సభ్యులు సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంలోకి చొచ్చుకుపోయారు. వీరితో పాటు మరికొంత మంది ఇతర పార్టీల ఎంపీలు కూడా వెల్ లోకి దూసుకుపోయారు. ఈ పరిస్థితుల్లో కూడా స్పీకర్ మీరా కుమార్ కొన్ని బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.

More Telugu News