: జగన్, సబ్బం హరిల మధ్య ఆసక్తికర సంభాషణ

మొదట్లో జగన్ వెన్నంటి ఉన్న అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, ఈమధ్య కాలంలో వైఎస్సార్సీపీకి దూరమవడమే కాకుండా... ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు, జగన్ కు మధ్య జరిగిన ఓ సంభాషణను సబ్బం హరి మీడియాకు వివరించారు. పార్లమెంటులో జగన్ తనను కలిశారని, నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారన్నా? అని అడిగారని... దీనికి సమాధానంగా, జరిగిందంతా మీకు తెలుసు... దీనికి సమాధానం కూడా మీరే చెప్పాలని బదులిచ్చానని ఎంపీ సబ్బం తెలిపారు.

More Telugu News