: పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం.. 12 గంటల వరకు వాయిదా
పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభలోనే సీమాంధ్ర ఎంపీలు ఇరు సభల్లో ప్లకార్డులు పట్టుకుని జై సమైక్యాంధ్ర, న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంలోకి వెళ్లి ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండటంతో సభలో గందరగోళం ఏర్పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే తీరు నెలకొంది. దాంతో, ఉభయసభలు గంటపాటు వాయిదా పడ్డాయి.