: శాసనసభ రేపటికి వాయిదా

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లుపై శాసనసభలో ఎలాంటి చర్చ జరగకుండానే.. సభ రేపటికి వాయిదా పడింది. ఉదయం రెండుసార్లు వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ రెండున్నర గంటల ప్రాంతంలో తిరిగి సమావేశమైంది. సీమాంధ్ర, తెలంగాణ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. పోటాపోటీగా నినాదాలు చేస్తుండటంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దాంతో, సభ సజావుగా జరిగేందుకు సభ్యులు సహకరించకపోవడంతో ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క సమావేశాన్ని రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

More Telugu News