: శాసనసభ ప్రారంభం .. గంటపాటు వాయిదా
శాసనసభ సమావేశాలు ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దీంతో సమైక్యాంద్ర, తెలంగాణ నినాదాలతో సభ మార్మోగింది. సభ్యుల ఆందోళన మధ్యే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. సభ్యులు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఆయన కోరారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సభ్యులు మినహా మిగిలిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు తమ తమ స్థానాల్లో నిలబడి నిరసన తెలిపారు. సభ నిర్వహణకు సహకరించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా సభ్యులు పట్టించుకోకపోవడంతో సభను గంటపాటు వాయిదా వేశారు.