: పార్లమెంటు ఉభయసభలు గంట వాయిదా

పార్లమెంటు ఉభయసభలు ఈ రోజు ప్రారంభంకాగానే వాయిదా పడ్డాయి. లోక్ సభ ప్రారంభం కాగానే, సీమాంధ్ర ఎంపీలు ప్లకార్డులతో స్పీకర్ వెల్ లోకి వెళ్లి, సమైక్య నినాదాలు చేశారు. వీరితో పాటు బీజేపీ సభ్యులు కూడా యూపీఏకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో, లోక్ సభను స్పీకర్ మీరా కుమార్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో కూడా బీజేపీ సభ్యులు గందరగోళం సృష్టించడంతో, సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రకటించారు.

More Telugu News