: అల్ ఖైదా తరహాలో పేట్రేగిపోవాలనుకున్నాం: భత్కల్

భారత్ లో పలు పేలుళ్ల తర్వాత 'ఇండియన్ ముజాహిద్దీన్'(ఐఎమ్) పేరు మోసిన ఉగ్రవాద సంస్థగా ప్రాచుర్యంలోకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ముందు ముందు అల్ ఖైదా నెట్ వర్క్ తరహాలో పేట్రేగిపోవాలని తాము కార్యాచరణ సిద్ధం చేసుకున్నామని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ తెలిపాడు. గతనెల అరెస్టయి ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న అతడు విచారణలో ఈ విషయాలు వెల్లడించాడు. ఆఫ్ఘనిస్తాన్, సోమాలియా దేశాల్లో మాదిరే భారత్ లోనూ షరియా చట్టాన్ని తీసుకురావడమే తమ అంతిమ లక్ష్యమని చెప్పాడు. అయితే, పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెన్సీకి ఏజెంట్ గా పని చేస్తున్న ఐఎమ్.. లష్కరే తోయిబాకు పూర్తిగా భిన్నమైనదని పేర్కొన్నాడు.

More Telugu News