: సీతాఫలాలతో ఎంతో మేలు

ఈ కాలంలో ఎక్కువగా, చవకగా లభించే పండ్లలో చెప్పుకోదగినది సీతాఫలం. ఈ పండ్లు ఈ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతాయి. ఇతర పండ్లతో పోల్చుకుంటే వాటి ధర కూడా తక్కువే. ఇలాంటి పండ్లను ఎక్కువగా తీసుకోవడం మన ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు. సీతాఫలాల్లో సి విటమిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. రోజూ ఒక సీతాఫలం పండును తినడం వల్ల మన శరీరంలోని వ్యర్థ పదార్ధాలు బయటకు పంపబడతాయి. అలాగే ఇందులో ఉండే ఎ విటమిన్‌ కంటిచూపు మెరుగుపడడానికి దోహదపడుతుంది.

జుట్టు ఒత్తుగా పెరగాలని ఆశపడేవారు చక్కగా సీతాఫలం పండ్లను తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. గుండె జబ్బులతో బాధపడేవారు వీటిని ఎక్కువగా తినడం వల్ల సమస్య అదుపులో ఉంటుంది. ఈ పండ్లలో ఉండే మెగ్నీషియం కండరాలను దృఢంగా ఉంచుతుంది. ఇందులోని పీచుపదార్ధం మన జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి, దాని పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ పండ్లలో ఉండే పోషకాలు శరీరంలో పేరుకుపోయివున్న కొవ్వును కరిగించడంలో కీలకపాత్రను పోషిస్తాయి. బలహీనంగా ఉండే చిన్న పిల్లలకు సీతాఫలాలను ఎంత ఎక్కువగా తినిపిస్తే అంత మేలు చేస్తాయి. ఈ పండ్లను ఎక్కువగా తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. కడుపులో మంట, జీర్ణ సంబంధ సమస్యలున్నవారు ఈ పండ్లను ఎక్కువగా తినడం వల్ల మేలు జరుగుతుంది. అలాగే డైటింగ్‌ చేసేవారు ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.

More Telugu News