: ప్రజలు కోరితే రాజీనామా చేస్తా : కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్

తాను కూడా సమైక్యవాదినేనని కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ తెలిపారు. ప్రజలు కోరితే రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని అన్నారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా స్పందించారు. తాను ఇప్పటివరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకే ప్రయత్నించానని కిషో్ర్ చంద్రదేవ్ తెలిపారు. విభజనకు అడ్డుకట్ట వేసేందుకే... రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయాలని తాను ప్రతిపాదించినట్టు వెల్లడించారు. మాతృవియోగం కారణంగా ఆయన కేంద్ర కేబినేట్ భేటీకి హాజరు కాలేకపోయారు.

More Telugu News