: బస్సు లోయలో పడి 19 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్ లోని సిర్మౌర్ జిల్లాలో బస్సు లోయలో పడిన ఘటనలో 19 మంది దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. రన్సువా - జోబ్రాగ్ గ్రామాల మధ్య ప్రయాణిస్తున్న బస్సు 600 అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే 18 మంది చనిపోయారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సంఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, గవర్నర్ సంతాపం తెలియజేశారు.

More Telugu News