: జమ్మూ-శ్రీనగర్ హైవేపై విరిగిపడ్డ కొండచరియలు.. తప్పిన ముప్పు

కొండచరియలు విరిగిపడడంతో జమ్మూ-శ్రీనగర్ నేషనల్ హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉధంపూర్ జిల్లా సమ్రోలి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో 200 వాహనాలు ఆగిపోయాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది కొండచరియలను తొలగించే పనిని చేప్టటారు. అమర్ నాథ్ యాత్రికులు ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కొండచరియలు విరిగిపడడానికి ముందే.. అమర్ నాథ్ భక్తులతో కూడిన కొన్ని వాహనాలు ఇదే మార్గంలో కాశ్మీర్ లోయ వైపు వెళ్లిపోయాయని పోలీసులు తెలిపారు. అవి అటు వెళ్లిన తర్వాత కొండచరియలు విరిగిపడడంతో ప్రాణాపాయం తప్పిపోయింది.

More Telugu News