: త్వరలో మున్సిపల్ ఎన్నికలు.. ఆగస్టులో నోటిఫికేషన్

ఒకవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే, త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆగస్టు మూడవవారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈసీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మొత్తం 150 మున్సిపాలిటీల్లోని 4,807 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వీటిలో ఎస్టీలకు 175, ఎస్సీలకు 538, బీసీలకు 1,366 స్థానాలు రిజర్వు అయ్యాయి. మరో 1908 స్థానాలు అన్ రిజర్వ్ డ్ గా ఉన్నాయి. వీటిలో 50 శాతం సీట్లు మహిళలకే కేటాయించారు.

More Telugu News