శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు

ముఖ్యమంత్రి కార్యాలయము    తెలంగాణ ప్రభుత్వం

పత్రికా ప్రకటన తేది.19-08- 2022

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కృష్ణుని జన్మదినం, హిందువులకు పర్వదినమని సిఎం అన్నారు. భారతీయ ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ జీవన విధానంలో గీతాచార్యుని తాత్వికత, బోధనలు, ఆచరణ అత్యంత
ప్రభావశీలమైనవని సిఎం అన్నారు. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా భగవాన్ శ్రీకృష్ణుని దీవెనలు అందాలని సిఎం కెసిఆర్ప్రా ర్థించారు.



More Press News